
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల మొట్టమొదటి ఎంపీపీ డుక్రే సుభాష్ పాటిల్ కన్నుమూశారు.. ఇచ్చోడ మండలం ధరంపూరి గ్రామానికి చెందిన ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.. ఈ రోజు ఉదయం ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో ఆదిలాబాద్ లోని రిమ్స్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మండల వ్యవస్థ ఏర్పడిన తరువాత జరిగిన మొట్ట మొదటి మండల పరిషత్ ప్రత్యక్ష విధాన ఎన్నికల్లో ఇచ్చోడ మండల అధ్యక్షునిగా సుభాష్ పాటిల్ గెలుపొందారు..టీడీపీ తో రాజకీయ జీవితం ప్రారంభించిన అయన ఆ తరువాత కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలలో కొనసాగారు..
Discover more from KIRAN NEWS UPDATES
Subscribe to get the latest posts sent to your email.