
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడా మండలం కోకస్ మన్నూర్ గ్రామంలో మంత్రాలు, తావిజుల పేరిట జనాలను నమ్మించి బురిడీ కొట్టిస్తున్న నకిలీ బాబపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు పోలీసులు.. ఇచ్చోడ సీఐ బండారి రాజు తెలిపిన వివరాల ప్రకారం ఇచ్చోడ మండలం కోకస్ మన్నూర్ గ్రామానికి చెందిన షేక్ అహ్మద్ అనే వ్యక్తి తనకు మంత్రాలూ వస్తాయని నమ్మిస్తూ,తాను తాయాత్తులు కడితే ఎలాంటి సమస్యలున్న పరిష్కారమైతాయని, ఎలాంటి వ్యాధులున్న నయం అవుతుందని నమ్మించి మోసం చేస్తున్నాడని గుర్తించి అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.. నిందితుడు కొన్ని రోజుల క్రితం కోకస్మన్నూర్ గ్రామంలో జరిగిన హత్యలో సైతం కారకుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.. అనారోగ్యానికి గురైతే ప్రజలు వైద్యులను సంప్రదించాలని, మూఢనమ్మకాలతో ఇలాంటి బాబాలను నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా పోలీసులు కోరారు…
Discover more from KIRAN NEWS UPDATES
Subscribe to get the latest posts sent to your email.