
ఆదిలాబాద్ జిల్లా మావలలో విషాదం చోటుచేసుకుంది.. సెలవు రోజు సరదాగా సైకిల్ పై ఆడుకుంటున్న అక్క, తమ్ముళ్లు ప్రమాదవశాత్తు నీటితో నిండి ఉన్న గుంతలో పడి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది… స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మావలకు చెందిన లంకస్వామి,గీత దంపతుల కూతురు వినూత్న(11) మరియు కొడుకు విధాత్ (8) లు సైకిల్ పై ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు ఓ వెంచర్ లోని నీటితో నిండి ఉన్న గుంతలో పడి మృతి చెందారు..స్థానికుల సహాయంతో చిన్నారుల మృతదేహాలను వెలికతీసిన పోలీసులు, మృతదేహాలను రిమ్స్ కు తరలించారు… ఇద్దరు పిల్లలను కోల్పోయిన తల్లితండ్రులు గుండెలు పగిలేలా రోదించిన తీరు అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది…
Discover more from KIRAN NEWS UPDATES
Subscribe to get the latest posts sent to your email.