
దాడులు, ప్రతి దాడులతో అట్టుడుకుతున్న మిడిల్ ఈస్ట్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తలతో ఆందోళనకు గురైన అంతర్జాతీయ సమాజానికి అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ శుభవార్త అందించారు.. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్లు ప్రకటన విడుదల చేశారు ట్రంప్.. ఇరాన్ కాల్పుల విరమణ మరో 6 గంటలలో, ఇజ్రాయెల్ కాల్పుల విరమణ మరో 12 గంటల్లో అమల్లో రానుందని ప్రకటనలో పేర్కొన్నారు..గత 12 రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య కొనసాగినా భీకర యుద్ధం మొత్తంగా మరో 24 గంటలలో అధికారికంగా ముగియనుందని తెలిపారు ట్రంప్..మిడిల్ ఈస్ట్ దేశాలలో తీవ్ర ఉద్రిక్తలు ఎటు దారితీస్తాయోనని ఆందోళనపడ్డ అంతర్జాతీయ సమాజం యుద్ధం ముగుస్తుందనే ప్రకటనతో ఊపిరిపీల్చుకుంది…
Discover more from KIRAN NEWS UPDATES
Subscribe to get the latest posts sent to your email.