
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రం లోని ప్రధాన రహదారిపై రాత్రింబవళ్ళు పశువులు తిష్ట వేస్తున్నాయి.. పదుల సంఖ్యలో రోడ్డుపై అడ్డంగా పడుకుంటుండటంతో వాహన చోదకులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.. రాత్రి పూట రోడ్డు పై పడుకుని ఉన్న పశువులు కనిపించకపోవడంతో ప్రమాదాలకు గురవుతున్నట్లు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. శివాజీ చౌక్ వద్ద, పోలీస్ స్టేషన్ ముందు, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఇలా ప్రధాన రహదారిపై పశువులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి..రోడ్డు పై అడ్డంగా ఉంటూ రాకపోకలకు సైతం ఆటంకం కలిగిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు వాహనదారులు..ఇప్పటికైనా అధికారులు పశువుల యజమానులను గుర్తించి పశువులు రోడ్లపై తిరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు..
Discover more from KIRAN NEWS UPDATES
Subscribe to get the latest posts sent to your email.