
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మే నెల చివర్లో ఊరించిన వర్షాలు, జూన్ నెలలో ముఖం చాటేశాయి..మొదట్లో కురిసిన వర్షాలతో రైతులు విత్తనాలు విత్తుకొగా, జూన్ మాసం ప్రారంభం నుండి ఒకటి, రెండు వర్షాలు మినహా సమృద్ధీగా వర్షాలు కురవకపోవడంతో మొక్క దశలో ఉన్న పంట వాడిపోయే పరిస్థితి నెలకొంది.. దీంతో వర్షాల కోసం రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు..ఇక సిరికొండ మండలం కోసుపటేల్ గూడ గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళలు గ్రామంలోని వాగులో పవిత్ర జలాలను బిందెలలో సేకరించి అక్కడి నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సుంకిడి గ్రామంలోని శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు…అంతే కాకుండా సమృద్ధిగా వర్షం కురిసి, వాడిపోతున్నా పంటలకు పునర్జీవం కలిగించాలని కోరుతూ అయిదు రోజుల పాటు ఉపవాసం ఉండేందుకు పూనుకున్నారు..ఇక జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురవాలని వివిధ రీతుల్లో పూజలు నిర్వహిస్తున్నారు జిల్లా ప్రజలు….
Discover more from KIRAN NEWS UPDATES
Subscribe to get the latest posts sent to your email.