
ఆదిలాబాద్ జిల్లా ఓ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికను స్నేహం పేరిట పరిచయం చేసుకుని, సామాజిక మాద్యమం వేదికగా చేసిన చాట్ ను అడ్డుపెట్టుకుని వేదిస్తున్న స్నేహితుల బృందాన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు… పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలికను స్నేహం పేరిట పరిచయం చేసుకున్న ఓ మైనర్ బాలుడు సామాజిక మధ్యమాల వేదికగా చేసుకున్న చాట్ ను అడ్డుపెట్టుకొని వేదించి, ఆమెతో బలవంతంగా వీడియో కాల్స్ మాట్లాడి, ఆ వీడియో కాల్స్ ను రికార్డ్ చేసి, రికార్డ్ చేసిన సదరు వీడియోను తన స్నేహితులతో పంచుకున్నాడు.. వీడియోలు తీసుకున్న ఆ బాలుడి స్నేహితులు సైతం వీడియో అడ్డుపెట్టుకుని బాలికను వేధించడం ప్రారంభించడంతో బాలిక విషయాన్నీ తన తల్లితండ్రుల దృష్టికి తీసుకెళ్లి తల్లితండ్రుల సహాయంతో పోలీసులను ఆశ్రయించింది.. బాధిత బాలిక పిర్యాదు మేరకు రంగంలో దిగిన పోలీసులు బాలికను వేధించిన 8 మందిని (ఆరుగురు మేజర్లు, ఇద్దరు మైనార్లు ) అదుపులోకి తీసుకుని వారి పై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించారు..ఇంకా విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు..
పిల్లల కదలికల పట్ల తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలి -ఆదిలాబాద్ జిల్లా పోలీసులు..
పిల్లల కదలికల పట్ల తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు… పిల్లల స్మార్ట్ ఫోన్ వాడకం పై నిఘా ఉంచాలని, వారి సామాజిక మధ్యామలపై ఓ కన్నేసి ఉంచాలని కోరారు.. స్నేహం పేరిట మొదలయ్యే పరిచయాలు అన్ని స్వచ్ఛమైనవి కావని,బాలికలను మానసికంగా లోబర్చుకుని తరువాత మానసికంగా వేధిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు..వేధింపులకు గురవుతున్న బాలికలు, అమ్మాయిలు భయం వీడి పోలీసులను ఆశ్రయిస్తే తప్పకుండ న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా భరోసానిచ్చారు పోలీసులు…
Discover more from KIRAN NEWS UPDATES
Subscribe to get the latest posts sent to your email.