
ఆదిలాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన నకిలీ నివాస ధ్రువీకారణపత్రాలతో ఆర్మీలో ఉద్యోగాలు పొందిన కేసులో విచారణను వేగవంతం చేశారు పోలీసులు.. నకిలీ సర్టిఫికెట్ లను సృష్టించిడానికి సహకరించిన ఇచ్చోడ మండలానికి చెందిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్లు తెలుస్తుంది…ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్ గ్రామం కేంద్రంగా కొనసాగిన ఈ వ్యవహారంలో ఆ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, కేశవపట్నం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పాత్ర ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు..ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది…ఇతర రాష్టాలకు చెందిన కొందరు యువకులు ఇచ్చోడ మండలం లోని ఇస్లాంనగర్ గ్రామం నుండి నకిలీ నివాస ధ్రువీకరణపత్రాలు పొంది ఆర్మీలో ఉద్యోగాలు పొందడంపై సీరియస్ గా పరిగణించిన పోలీసులు రెండు నెలల క్రితం ఇచ్చోడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన విషయం విదితమే…
Discover more from KIRAN NEWS UPDATES
Subscribe to get the latest posts sent to your email.