
స్వచ్ఛంద సేవ సంస్థల పేరిట జనాలను బెదిరించి, వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు… ఇచ్చోడ పోలీస్ స్టేషన్ లో మీడియా తో మాట్లాడిన అయన జిల్లాలో పలువురు ఫౌండేషన్,గ్రూప్స్, యూత్స్ పేరిట కొన్ని సంస్థలను నెలకొల్పి జనాలను బ్లాక్ మెయిల్ చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని,రెండు మూడు సార్లు సేవ కార్యక్రమాలు చేసి, బెదిరింపులకు పాల్పడుతూ వసూళ్లకు పాల్పడితే అది ఆమోదయోగ్యం కాదని అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు..అలాంటి వారు ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే తమ ద్రుష్టికి తీసుకురావాలని, వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు..
Discover more from KIRAN NEWS UPDATES
Subscribe to get the latest posts sent to your email.